- Advertisement -
స్ఫూర్తితో ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో నడవాలి బిబి పాటిల్
నవతెలంగాణ – మద్నూర్: లోకమాత అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో ఆ మహా మాతృమూర్తి విగ్రహాన్ని విగ్రహ దాతగా బిబి పాటిల్ శనివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలబాయి హోల్కార్ స్ఫూర్తితో ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో ముందుకెళ్లాలని కోరారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, ఎస్ గంగారాం ,కత్గావ్ మహారాజ్, మల్లికార్జున అప్ప, ఇతర గ్రామాల నుండి వచ్చిన మహారాజులు, మరాఠా గ్రామ కుల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -