Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలి: సీఐ సంతోష్

మండల ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలి: సీఐ సంతోష్

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. కావున వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. కావున ఆత్మకూరు మండలం పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజలను కోరారు. అలాగే శిదిలావస్థలో వున్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఐ తెలిపారు. భారీ వర్షాల కారణంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ అత్యవసరం ఉంటేనే తప్ప బయటకు రావోద్దని కోరారు. వెదర్ అప్డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోవాలని, వర్షంలో వాహనం పై ప్రయాణించే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని అన్నారు. వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. ముఖ్యముగా వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని అన్నారు. విద్యుత్ స్థంబాల దగ్గర్లో నిలబడటం, తాకడం చేయద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజలకు సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ఆర్ సంతోష్ ప్రజలను అప్రమత్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -