- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలకు 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని పూర్వ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఉన్న ఊరును, కన్నతల్లిని, విద్యాభ్యాసం అందించే బడిని జీవితంలో మరువకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముస్కు నిశాంత్, సముద్రాల ఆంజనేయులు,జీడి నరేందర్,రాపాక అనిల్, గాదేపాక కిరణ్,ఎండి నసీరుద్దీన్ ,నరేష్, నాగేందర్, చారగొండ్ల రవి , స్వప్న, సరిత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -