- Advertisement -
- – అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
- నవతెలంగాణ -తాడ్వాయి
- దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొమరం భీం పక్కనే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశానికి మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ప సునీల్ దొర సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
- ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. వి ఆర్ అంబేద్కర్ తండ్రికి వచ్చిన చిన్న ఆలోచన ఆయనను ప్రపంచ జ్ఞానిగా తీర్చిదిందని తెలిపారు. అణచివేత చిన్న చూపులకు గురైన అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరు సాధించలేని ఉన్నదా చదివి భారతదేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మనల్ని పొందారున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో తీవ్ర లోపం ఉందని, దీనివల్ల ప్రమాదకర అవకతవకలు జరుగుతున్నాయన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని నిరంతరం జ్ఞాన కోసం శ్రమిస్తూ తాము తక్కువ కాదని దృక్పథంతో ఉండాలన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ దేశంలో ప్రతి వారికి కావలసిన వ్యక్తి అంబేద్కర్ అని, ఒక వర్గం, కులానికి కాదని, అందరి కోసం రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావి అని కొనియాడారు. మేధావులు విద్యావంతులు రేగ నరేందర్, మైహిపతి అరుణ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికే దార్షనికుడని అన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఆయన అందరివాడు అన్నారు.
- అనంతరం కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్కను సన్మానించారు. మంత్రి సీతక్క ప్రజాసంఘాల నేతలను, తుడుం దెబ్బ నాయకులను కూడా ఆమె సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచంద్ర, ములుగు డి.ఎస్.పి రవీందర్, పస్రా సిఐ రవీందర్, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు బొలు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బండారు చంద్రయ్య, మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, స్థానిక ఇన్చార్జి తాసిల్దార్ సురేష్ బాబు, గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు లంజ పెళ్లి రాము, నరసయ్య, పొడెం బాబు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జలప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దానక నర్సింగరావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రవి గౌడ్, పద్మశాలి నేత మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రధాన కార్యదర్శి వావిలాల రాంబాబు, మాజీ సర్పంచ్ ముజఫర్, కోగిల సారయ్య, ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు రాసపల్లి భద్రయ్య, ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు మేధావులు ఉపాధ్యాయులు విద్యార్థులు కళాకారులు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -