స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీలపై
శాట్జ్ చైర్మెన్ శివసేన రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా పాఠశాలలను దేశంలోనే ఆదర్శవంతమైన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ కే. శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ స్పోర్ట్స స్కూల్ను సందర్శించిన శివసేన రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..’శాట్జ్ స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల్లో సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నాం. స్పోర్ట్స్ బడ్జెట్ను రాష్ట్రంలో నాణ్యమైన క్రీడాకారులను తయారు చేసేందుకు ఉపయోగిస్తాం. అందుకు మరిన్ని నూతన స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించేలా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని’ అన్నారు.
సౌకర్యాలకు పెద్దపీట
- Advertisement -
- Advertisement -