ఐసీడీఎస్ డైరెక్టర్కు వినతి
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వేతనాలు పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో ఐసీడీఎస్ డైరెక్టర్కు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిజయలక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వినతి పత్రాన్ని సమర్పించారు.ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మార్చి 16 నుండి అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూట బడిని వెంటనే నిర్ణయం చేయాలని కోరారు. మే నెలంతా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలని పేర్కొన్నారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



