Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభార్య మీద కోపంతో.. అత్తింటికి నిప్పు పెట్టిన వ్యక్తి

భార్య మీద కోపంతో.. అత్తింటికి నిప్పు పెట్టిన వ్యక్తి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో గురువారం ఒక వ్యక్తి తన భార్యపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. జైనూర్‌కు చెందిన ముజాహిద్‌ బేగ్‌, ఎల్లాపాటార్‌కు చెందిన షమాబీ దంపతులు 9 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేదని ముజాహిద్‌ తరచూ గొడవలు పడటంతో 20 రోజుల క్రితం షమాబీ పుట్టింటికి వెళ్లింది. దీంతో ముజాహిద్‌ అత్తింటికి వెళ్లి గ్యాస్‌ పైపు లీక్‌ చేసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -