- Advertisement -
– 81 రోజుల హుండీ లెక్కించిన దేవాదాయశాఖ అధికారులు.
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో 81 రోజుల హుండీలు విప్పి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించగా రూ.6,17,220/- ఆదాయం వచ్చినట్టు దేవాలయ కార్య నిర్వహణ అధికారి సత్యచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారి వీణధరి, పర్యవేక్షకులు, గ్రామపెద్దలు, పూజారులు, భక్తులు, యాత్రికులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



