- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఏప్రిల్ 2 నుంచి మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి జయంతి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ క్రమంలో శుక్రవారం మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ దిగంబర్, ఆలయాధికారి వేణు ఎస్సైను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేలూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయ్ పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.
- Advertisement -



