నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని రామ్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులచే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ షీ టీం ఆధ్వర్యంలో చేయించారు. సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రాధనో పాధ్యాయులు గద్దె గంగాధర్ బుధవారం తెలిపారు. డ్రగ్స్ వల్ల సమాజానికి ఇలాంటి నష్టం జరుగుతుందో, విద్యార్థుల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో వివరించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ.. విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు.
సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్ 8712659795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు.. ఐసిడిఎస్ సూపర్వైజర్ నలిని మాట్లాడతూ పిల్లల అక్రమ రవాణా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలోవివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది , అంగన్వాడీ టీచర్స్ హేమలత, నర్మద, అనిత ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రామ్ మందిర్ పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ
- Advertisement -
- Advertisement -