- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఈనెల 18, 19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా నాగార్జున్ సాగర్లో పర్యటించనున్నారు. 18న కుటుంబ సమేతంగా సాగర్ కు వచ్చి అక్కడ బుద్ధవనం, డ్యాం పరిశీలన చేయనున్నారు. లాంచీ ద్వారా నాగార్జున కొండను సందర్శించినట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. 19వ తేదీన తిరిగి వెళ్ళిపోతారని చెప్పారు. నాగార్జునసాగర్ లో ఏపీ గవర్నర్ పర్యటన దృశ్య రెవెన్యూ, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -