- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇలా పట్టాలు ఇచ్చారని ఆరోపిస్తూ ప్రజలు భువనగిరి బొమ్మలరామారం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులవారికి ఇండ్లను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -