– జిఇ వెర్నోవాతో వ్యూహాత్మక ఒప్పందం
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరికరాల తయారీలో అగ్రగామి అయిన ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ హైదరాబాద్లోని తునికిబొల్లారంలో సరికొత్త ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించినట్టు తెలిపింది. జిఇ వెర్నోవా వారి స్టీమ్ పవర్ సర్వీసెస్ బిజినెస్ కోసం ఆజాద్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అండ్ ఇన్నోవే షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా ఓ సరికొత్త మైలురాయిను చేరిన ట్లు ఆ సంస్థ పేర్కొంది. 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అత్యా ధునిక యూనిట్ను జీఈ వెర్నోవా ఉన్నతాధికారులు లీన్ లీడర్ రొడోల్ఫో టోరెస్, సోర్సింగ్ లీడర్ అంకుర్ చందక్, గ్లోబల్ కమోడిటీ లీడర్ మార్టిన్ షేఫర్, సప్లయర్ క్వాలిటీ లీడర్ అఖనా కబాకా, గ్లోబల్ ప్లానింగ్ లీన్ లీడర్ కార్లీ లోరెన్స్, ఆజాద్ ఇంజినీరింగ్ సీఈఓ, చైర్మెన్ రాకేష్ చొప్దార్ ఉన్నారు.
తునికిబొల్లారంలోఆజాద్ ఇంజనీరింగ్ కొత్త ప్లాంటు
- Advertisement -