- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ బాబు జగ్గీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ గ్రామపాలన అధికారి కె సత్యం, కార్యాలయ సిబ్బంది అశోక్, శంకర్, రమేష్, హుల్లాజీ పాల్గొన్నారు.
- Advertisement -



