Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

- Advertisement -

అసెంబ్లీ ఇన్చార్జ్ ఉల్పర కృపానందం 
నవతెలంగాణ – అచ్చంపేట :
నల్లమల్ల ప్రాంతం ఎస్సీ అచ్చంపేట నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు బి ఎస్ పి అసెంబ్లీ ఇన్చార్జ్ పుల్పర కృపానందం తెలిపారు. ఆదివారం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కూర్చొని పార్టీ విధివిధానాల పైన చర్చించుకున్నారు. ఈనెల 21న అచ్చంపేటలో అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ నెంబర్ బండి పృథ్విరాజ్, జిల్లా ఇన్చార్జి బిసమోళ్ల యేషేఫ్, జిల్లా అధ్యక్షుడు బోనాసి రామచంద్ర హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -