Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమాకబడ్డీ నేపథ్యంలో 'బల్టీ'

కబడ్డీ నేపథ్యంలో ‘బల్టీ’

- Advertisement -

షేన్‌ నిగమ్‌, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్య రాజ్‌, సెల్వరాఘవన్‌తో పాటు ‘ప్రేమమ్‌’ డైరెక్టర్‌ ఆల్పాన్స్‌ పుదిరన్‌ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘బల్టీ’. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగులో విడుదలవుతోంది.
కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్‌ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్‌.ఎథిల్‌ రాజ్‌ మాట్లాడుతూ, ‘తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్‌ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో వున్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందించారు. మలయాళంలో ‘ఆర్‌.డి.ఎక్స్‌’ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్‌ నిగమ్‌ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్‌ నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు సెల్వరాఘవన్‌ విలన్‌ పాత్రలో అద్భుతంగా నటించారు’ అని అన్నారు.
‘తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్‌ అండ్‌ ఔట్‌ రా, రస్టిక్‌ విలేజ్‌ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు, వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్‌ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమా ఉంటుంది. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు ఉన్ని శివలింగం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -