- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె సృజనను న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ న్యాయవాదులు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని శనివారం అందించారు. వారితో మాట్లాడుతూ.. గతంలో వారు నిజాంబాద్ జిల్లా జడ్జిగా పని చేసినటువంటి సమయంలో వారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయ సేవలను గుర్తు చేయిస్తూ వారితో మాట్లాడడం జరిగింది. వారిని కలిసిన వారిలో న్యాయవాదులు బిట్ల.రవి, పిల్లి.శ్రీకాంత్ వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -