- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ బోర్డు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఇంటర్మీడియెట్ బోర్డులో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పలు పాటలకు మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, నాయకులు వంశీకృష్ణ, వసుంధరదేవి, స్వప్న జోషి, సబిత, అరుణ, అవినాశ్, కిరణ్, ప్రసాద్, సుకన్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -