Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ ఆవరణలో బీసీల మౌన దీక్ష

మున్సిపల్ ఆవరణలో బీసీల మౌన దీక్ష

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలోని మహాత్మ జ్యోత్కబాపూలే,అంబెడ్కర్ విగ్రహాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు విద్యా,ఉద్యోగాలు,రాజకేయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ ల హక్కులను నెరవేర్చాలని అన్నారు. తమిళనాడు తరహాలో 50 శాతం సీలింగ్ ఎత్తేసి బీసీలకు జనాభా దామాషా ప్రాతిపధికన రిజర్వేషన్లు కేయాయించాలన్నారు. బీసీ ఉద్యమాన్ని గల్లీ నుండి క్షేత్ర స్థాయిలో  “మెమెంతో మాకంత” అనే నినాదంతో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ఉద్యమాన్ని నడిపిస్తామని అన్నారు.

త్వరలోనే వెయ్యి మందితో కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామ,మండల,నియోజకవర్గాల వారీగా బీసీల చైతన్యం కోసం యాత్ర చేపడతామని అన్నారు. అన్ని సంఘాలని,అఖిలపక్ష పార్టీలని,ప్రజా సంఘాలని,విద్యార్థినుసంఘాలని కలుపుకొని నిరంతరం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్,పండ్ల రాజు,కన్నయ్య,పున్న రాజేశ్వర్,గుడుగుల  శ్రీనివాస్, మల్లన్న, రాజేందర్, ఇర్ఫాన్,లలిత,మంజుల,రాజయ్య,రాజీవ్,సాయికృష్ణ,బాగయ్య,ఎల్లయ్య,అంజద్,పంపరి లక్ష్మణ్,శ్రీనివాస్, రమేష్,దయాకర్,అరుణ్,విఠల్,నర్సింహ,నర్సా గౌడ్,నారాయణ,సురేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -