- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్షి గా నియామకమైన రాంభూపాల్ ను బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలు గా బిసిల అభివృద్ధి కై అహర్నిశలు పోరాడుతున్న రాంభూపాల్ కు సముచిత ప్రాధాన్యం కల్పించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి టియు జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, సలహాదారులు రమణ స్వామి, విజయ్ కుమార్, నాయకులు దాసు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -