మంచి ఆహార అలవాట్లు
ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పునాది
“నవ తెలంగాణ”తో కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేముల రంజిత్ ప్రత్యేక ఇంటర్వ్యూ
నవతెలంగాణ – తాడ్వాయి
డాక్టర్స్ డే సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని “కాటాపూర్” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రముఖ వైద్యులు (మెడికల్ ఆఫీసర్) వేముల రంజిత్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ !
నవతెలంగాణ విలేఖరి: డాక్టర్ గారు నమస్తే, డాక్టర్స్ డే శుభాకాంక్షలు
డాక్టర్: నమస్కారం థాంక్యూ, వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు
నవతెలంగాణ విలేకరి: ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మీరు ఇచ్చే సూచన ? మీరు అందించి చికిత్స ఏమిటి ?
డాక్టర్: అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి. అప్పుడు రోగి లక్షణాలు వారికి కలుగుతున్న అనారోగ్య సమస్యలు వారి మాటల ద్వారా తెలుసుకొని సరైన రీతిలో పేషెంట్ అనారోగ్య సమస్యను డయాగ్నోసిస్ (రోగనిర్ధారణ) చేసి తాము ఇచ్చే చికిత్స ద్వారా తగ్గే అవకాశం ఉంటే తగ్గించడం, లేదంటే పేషెంట్ ని సంబంధిత ప్రత్యేక వైద్యుని వద్దకు చికిత్స కోసం వెళ్లమని సూచించడం జరుగుతుంది.
నవతెలంగాణ విలేఖరి: సీజనల్ వ్యాధులు అంటే ఏమిటి ? ప్రస్తుతం ఏ ఏ సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి ?
డాక్టర్: సీజనల్ వ్యాధులు అంటే సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో వచ్చే వ్యాధులు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరం, మరియు డెంగ్యూ మలేరియా వంటి వర్షాకాలం సీజన్లో ఈ వ్యాధులు సంక్రమిస్తాయి.
నవతెలంగాణ విలేఖరి: డెంగ్యూ గురించి వివరిస్తారా ?
డాక్టర్: డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఏడిస్, ఈజిప్టి, ఏడీస్ అల్బో పిక్టస్ అని దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు పడిపూట ఎక్కువగా పుడతాయి. డెంగ్యూ వ్యాధి సోకితే తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనక నొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు, దద్దుర్లు మరియు వికారం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రాణాంతకం అవుతుంది. సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు, ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి. పది రోజుల వరకు ఉంటాయి. ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు) కాలేయం పెద్దదిగా మారడం రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉంటాయి.
భారీ రక్తస్రావం షాక్ మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రం అంటారు. మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. మీ రక్తప్రవంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్లెట్స్) తగ్గుతుంది. ఇది స్ట్రోక్ అంతర్గత రక్తస్రావం అవయవ వైఫల్యం మరణానికి కూడా దారి తీస్తుంది. ఎవరికైనా డెంగ్యూ జ్వరం లక్షణాలు కల్పించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించండి.
నవతెలంగాణ విలేఖరి: మలేరియా జ్వరం గురించి వివరిస్తారా ?
డాక్టర్: మలేరియా అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి, ఇది సోకిన ఆడ అనాఫిలస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ప్లాస్మోడియం అనే పరానా జీవి ద్వారా వస్తుంది. మలేరియా సోకిన వ్యక్తికి జ్వరం వణుకు తలనొప్పి కండరాల నొప్పులు వాంతులు విరేచనాలు మరియు దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిని సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. ప్రస్తుతం మలేరియా కు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అయితే సమయానికి చికిత్స చేయించుకోకపోతే మలేరియా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
నవతెలంగాణ విలేఖరి: అతిసార వ్యాధి కలవడానికి గల కారణాలు ? లక్షణాలు ?
డాక్టర్: అతిసారం అనేది అనేక కారణాలవల్ల సంభవించవచ్చు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, జీర్ణ వ్యవస్థలో సమస్యలు కొన్ని మందుల వల్ల కూడా అతిసార వ్యాధి రావచ్చు. వర్షాకాలంలో త్రాగునీరు కలుస్తామయ్యా అవకాశం ఎక్కువ, కలుషిత ఆహారం నీరు తీసుకోవడం మూలాన అధికారి వ్యాధికి గురవుతారు. వ్యాధి లక్షణాలు, వాంతులు విరోచనాలు తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం డీసెంట్రి అయితే రక్త విరోచనాలు వికారం ఉండడం అన్నహితం లేకపోవడం మూలంగా ఈ జబ్బు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.
అతిసార వ్యాధిని ఆంగ్ల భాషలో డయేరియా అంటారు. అధికార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసారం వ్యాధితో పాటు నెత్తురు పడితే “డీసెంట్రి” అంటారు. పిల్లల్లో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రీ వివిధ రకాలైన బ్యాక్టీరియా ప్రోటోజువాల ద్వారా వస్తుంది. అతిసార వ్యాధి సురక్షిత నీరు త్రాగు తూ పరిశుభ్రత పాటించడం ద్వారా నివారించవచ్చు.
నవతెలంగాణ – విలేఖరి: డయాబెటిస్, అధిక రక్తపోటు చాలామందిలో కనిపిస్తున్న సమస్య వీరికి మీరు ఇచ్చే సూచన ఏమిటి ?
డాక్టర్: మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పునాది. డయాబెటిస్ అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు మితమైన ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవడంతో పాటు వైద్యులు సంప్రదిస్తూ అతని సలాం మేరకు క్రమం తప్పని కనీసం 30 నుండి 45 నిమిషాల వేగవంతమైన నడక లేక వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.