నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులను కామారెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ సన్మానించారు. జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన 9 మంది ఉద్యోగులకు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల పురస్కారాలు అందజేయబడినవనీ, విశేష సేవలు అందించిన 21 మంది ఉద్యోగులకు కామారెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
గత సంవత్సరం సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో అంకితభావంతో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన 230 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులకు సూపరింటెండెంట్ ఇంజనీర్, కామారెడ్డి రవీందర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ మాట్లాడుతూ అవార్డులు పొందిన ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.



