నవతెలంగాణ -తాడ్వాయి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో “బడిబాట” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ కేశవరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతి గదులు బోధిస్తున్నామని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు నోట్ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్య తో పాటు పౌష్టికాహారమైన కోడిగుడ్లు, రాగిజావ వంటి ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES