- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం నూతన హంగులతో కళకళలాడుతుంది. జిల్లా ఆర్టిఐ ప్రతినిధి, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంగల రవీందర్ తన సొంత ఖర్చుతో భిక్కనూర్ బస్టాండుకు రంగులు వేయించారు. గత కొన్ని సంవత్సరాలుగా మూలన పడి రంగులు లేకుండా వెలవెలబోయిన బస్టాండ్ రంగులు వేయడంతో కళకళలాడుతుంది. సొంత డబ్బులతో రంగులు వేయిస్తున్న గంగల రవీందర్ ను పట్టణ ప్రజలు అభినందించారు.
- Advertisement -