- Advertisement -
భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే జరుపుటకు భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో 21న బొమ్మలరామారం మండలం మునీరాబాద్ గ్రామంలో 20న గ్రామ సభలు నిర్వహించుటకు నిర్ణయించబడనున్నట్లు, సంబంధిత రైతులు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి కోరారు.
- Advertisement -



