- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి బీజేపీ పార్టీలో నేను కొనసాగలేనని టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు చెర్క మహేశ్ తన రాజీనామా లేఖను పంపారు.
- Advertisement -