Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం

ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : ఎస్బీఐ రీజనల్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్  ప్రారంభించారు. ఎస్బిఐ 71 వార్షికోత్సవ సందర్భంగా వందమందికి పైగా రక్తదానం చేస్తున్నందుకు కలెక్టర్ వారిని అభినందించారు. రక్తదానం మహాదానమని, ఆపదలో ఉండి రక్తం అవసరమున్నవారికి మనమందరం ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు. ముఖ్యంగా యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాన్సువాడలో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రీజనల్ మేనేజర్ జి వెంకటేశ్వర్లు,  జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న , మేనేజర్ హెచ్ ఆర్ రమణ మిగతా ఎస్బిఐ అధికారులు, సిబ్బంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad