- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బొల్లి గంగాధర్ గురు స్వామీ ను నియమించినట్టు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్న బొల్లి గంగాధర్ గతంలో కూడా పార్టీ పట్టిష్టతకు పని చసినందుకు గాను గుర్తించిందని అదేవిధంగా మండల అధ్యక్షునిగా కొనసాగిన అనుభవం ఉందని, అందువల్లనే మళ్లీ ఆయనని పార్టీ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని ఒక ప్రకటనలు తెలిపారు.
- Advertisement -



