Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ ఇంచార్జి

విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ ఇంచార్జి

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల:  గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లోఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ వన్ మంత్ నాయుడు శనివారం విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఫుట్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  గంజిపేట రాజు, శేఖర్ నాయుడు, శ్రీరాములు, అంజి, గంగాధర్, రామ్మోహన్ యాదవ్, చిన్న యాదవ్, రాజు, వీరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -