- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్లో సీఎ విద్యార్థి కుమ్మరి జనార్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో ఉరికి వేలాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గదిలో రక్తపు మరకలు ఉండటంతో జనార్ధన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


