నవతెలంగాణ – అమరావతి: కడప జిల్లా పులివెందులలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితులుగా భావిస్తున్న ఇద్దరిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ను కారులో వెంబడించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్, తనను కొందరు వ్యక్తులు కారులో వెంబడించారని ఆరోపిస్తూ పులివెందుల పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు చేపట్టారు. వైఎస్ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ)గా పనిచేస్తున్న లోకేశ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అవినాశ్ రెడ్డి అనుచరులపై కేసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES