నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పంభాపూర్ మాజీ సర్పంచ్ పోలేబోయిన కృష్ణ, బిఆర్ఎస్ సీనియర్ నేత, బిఆర్ఎస్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోలేబోయిన లక్ష్మీనారాయణ ల తండ్రి పోలెబోయిన నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి దశదినకర్మకు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, మాజీ జెడ్పిటిసి రామాసహాయం శ్రీనివాస్ రెడ్డి, లు కార్యకర్తలతో కలిసి వచ్చి పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని రకాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ నాలి కన్నయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య, మహిళా మండల అధ్యక్షురాలు సోమనాగమ్మ, నాయకులు సాయిరి లక్ష్మీనరసయ్య, రామిళ్ళ లాలయ్య, బిక్షపతి, అర్రెం కృష్ణ,పాయం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ తండ్రి దశదినకర్మకు హాజరైన ప్రముఖులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES