నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం కడప జిల్లాలో మహానాడు వేదికపై ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మెన్ వర్ల రామయ్య ప్రకటించారు. అనంతరం చంద్రబాబు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏపీతోపాటు తెలంగాణ పార్టీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. 1995లో తొలిసారిగా చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత 30 ఏండ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. టీడీపీలో ప్రతి రెండేండ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ” నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది నా బలం, బలగం టీడీపీనే. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. వచ్చే 40 ఏండ్లకు ప్రణాళిక రచించుకు న్నాం. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు. రత్నాల సీమగా మారుస్తామని చెప్పాం. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండటానికి టీడీపీనే కారణం. హైదరాబాద్లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశాం. టీడీపీ అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుంది”..అని చంద్రబాబు అన్నారు.
తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టింది:నర్సిరెడ్డి
దేశంలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని తెలుగుదేశం సీనియర్ నాయకులు, టీడీపీ సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. తద్వారా సమాజంలో సాంఘీక దురాచారాలను రూపుమాపారని గుర్తు చేశారు. బడగు, బలహీనవర్గాల తరపున నిలబడ్డారని చెప్పారు. భారత పార్లమెంటులో ప్రధాన భూమిక పోషించే స్థాయి, సత్తా టీడీపీకి ఉందని నిరూపించిన ఘనత అన్న ఎన్టీఆర్దేనని కొనియాడారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే విధానం కోసం సంక్షేమ పథకాన్ని తెచ్చింది టీడీపీనేనని వివరించా రు. చంద్రబాబు చొరవతో ఐటీ, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు ఉమ్మడి ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ప్రపం చవ్యాప్తంగా వస్తున్న మార్పులను అధ్యయనం చేసి వాటి దిశగా మనల్ని నడుపుతున్న నాయకులు చంద్ర బాబు అని అభినందించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకు నడిపించాలని కోరారు. మహానాడులో తెలంగాణ తరపున నర్సిరెడ్డితోపాటు మరో నాయకుడు దుర్గాప్రసాద్ మాట్లాడారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవ ఎన్నిక
- Advertisement -
- Advertisement -