Friday, June 27, 2025
E-PAPER
Homeఖమ్మంవిత్తన దుకాణాల తనిఖీలు

విత్తన దుకాణాల తనిఖీలు

- Advertisement -

పోలీసు శాఖ ఆధ్వర్యంలో విత్తన దుకాణాల తనిఖీలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ – సీఐ నాగరాజు రెడ్డి…
నవతెలంగాణ – అశ్వారావుపేట

నకిలీ విత్తనాలు విక్రయించి నా,అధిక ధరలతో రైతులను ఇబ్బంది పెట్టినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఐ నాగరాజు రెడ్డి విత్తన,ఎరువుల దుకాణదారులు ను హెచ్చరించారు. ఖరీఫ్ తరుణం లో రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు కొనుగోలు చేస్తున్న క్రమంలో నకిలీ విత్తనాలకు తావివ్వకుండా పఠిష్ట చర్యల్లో భాగంగా గురువారం మండలంలోని వినాయకపురం లో గల నంద గోపాల ఆగ్రో కెమికల్స్ లో పత్తి,మొక్కజొన్న విత్తనాల స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. రైతు సోదరులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలి,ఎవరైనా నకిలీ విత్తనాలు లేదా అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శిక్షణా ఎస్.ఐ అఖిల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -