నవతెలంగాణ – కంఠేశ్వర్ : సిఐటియు టీజీ యూ ఈ ఈ యు యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి విజయం సాధించుకున్న ఆర్టిజన్ ఉద్యోగులకు జై జైలు అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న విద్యుత్ భవనంలో ఎస్ ఈ రవీందర్ కి సిఐటియు జిల్లా కమిటీ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఎస్ ఈ టీజీ ఎన్ పీడీసీఎల్ నిజాంబాద్ కి ఈ నెల ఐదో తారీకు రోజు కలిసి ఆర్టిజన్ ఉద్యోగుల పని భారం తగ్గించాలని 8 గంటల పని కల్పించాలని కోరడం జరిగింది. స్పందించి ఎనిమిది గంటల పని దినం కల్పిస్తూ సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది .వారికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని డివిజన్ సబ్ డివిజన్ సెక్షన్లలో ఈ సర్కిలర్ను అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్, గంగాధర్, మురళి, మహేష్, రాజు, రవీందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరేడ్డి చంద్రరేడ్డి మాట్లాడుతూ..యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఈ ని కలిసి ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగింది. విద్యుత్ సంస్థలొ పనిచెస్తూనా కార్మికుల సమస్యలపై నిజాంబాద్ సర్కిల్ ఎస్ ఈ ని కలిసి విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులపై పనిభారం తగ్గించాలని సబ్ స్టేషన్ లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు లేక ఒకొ సబ్ స్టేషన్ లో ఇద్దరు డ్యూటీ చేసే పరిస్థితి ఉందని ఇంకొకరిని డ్యూటీకి అడ్జస్ట్ చేయాలని ప్రతి సబ్ స్టేషన్ లో ముగ్గురు డ్యూటీ చేసే విధంగా తాత్కాలికంగా నైనా ఇతర ఉద్యోగులతోనైనా పని చేయించాలని కోరడం జరిగింది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మరియు కార్మికులకు రావాల్సిన పేయిడ్ హలిడేసు కూడా అధికారులు ఇవ్వడం లేదని వాటిని వెంటనే పరిష్కరించాలని శనివారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఈ ని ని కలిసి చర్చించడం జరిగింది. వారు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు.లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టిజన్ ఉద్యోగులకు జేజేలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES