- Advertisement -
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 24న ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తున్న రౌండ్టేబుల్ సమావేశానికి తమ ప్రతినిధి హాజరవుతారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలనీ, ఆర్టీసీలో యానియన్ల కార్యకలాపాలను పునరుద్ధరించాలని సీఐటీయూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించిందని పేర్కొన్నారు. ఇదే అంశంపై టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నకు ఆయన లేఖ రాశారు. ఆర్టీసీ రక్షణ కోసం జరుగుతున్న ఐక్య పోరాటాలకు సీఐటీయూ బాసట నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



