- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్నూర్ మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ మండల అభివృద్ధి అధికారి రాణి, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో 161వ జాతీయ రహదారిపై శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాతీయ రహదారికి గల పెద్ద ఎక్లారా, శాఖాపూర్ లచ్చన్ గేట్, మేనూర్, చిన్న షక్కర్గా పంచాయతీ పరిధిలోని సలాబత్పూర్, గ్రామాల పరిధిలో హైవే రోడ్డును శుభ్రం చేశారు రోడ్డుపై గల అపరిశుభ్రత చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



