- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట తాండకు చెందిన దేగావత్ (రెడ్డి) కి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేల చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ చేతుల మీదుగా అందజేశారు. రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రి లో చికిత్స చేసుకుంటూ ఉండగా అతనికి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జావిద్ ఉద్దీన్, కంఠం గంగారాం, మాజీ సర్పంచ్ గణేష్ నాయక్, రామచందర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -