Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయ నిధి పథకం.. పేదలకు వరం 

సీఎం సహాయ నిధి పథకం.. పేదలకు వరం 

- Advertisement -

తాడ్వాయి పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
: సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని మేడారంలో రూ.1,10,000 విలువ గల రెండు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్థిక మేలు జరుగుతుందన్నారు. వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు (రోగులకు) సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేతను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు గడిగా అనిల్, నాయకులు  రమేష్, సీనియర్ నాయకులు అట్టం సమ్మయ్య, యూత్ అధ్యక్షులు సిద్ధబోయిన పూజారావు, ఊరటం గ్రామ కమిటీ అధ్యక్షులు కోటే నరసింహులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -