కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల వైద్యానికి ఆర్థికంగా ఎంతో భరోసానిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో 9 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పసుపుల విష్ణు తేజకు రూ.24వేలు బోదాస్ మానసకు రూ.60వేలు ఆమెద శ్రీ వర్ధన్ కురూ.60వేలు, ముని మాణిక్యం కవితకు రూ.30వేల 500, గంగుల శ్రావణ్ కుమార్ కు రూ.28వేలు, సుంకారి కిరణ్ కు రూ.62వేలు, వేముల చిన్న నర్సయ్యకు రూ.36వేలు, శ్రీరాముల నందినికి రూ.16వేలు, కొత్వాల్ సరస్వతికి రూ.28వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. అట్టి చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు వైద్య ఖర్చులకోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ద్వారా ఎంతోమంది రోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి నూకల బుచ్చి మల్లయ్య, నాయకులు సుంకేట శ్రీనివాస్, వేములవాడ జగదీష్, నల్ల సాయికుమార్ గుప్తా, ఉట్నూరి నరేందర్, అజ్మత్ హుస్సేన్, సుంకరి నర్సయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పేదల వైద్యానికి ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES