Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల విద్యార్థికి కలెక్టర్ అభినందన

గురుకుల విద్యార్థికి కలెక్టర్ అభినందన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : తెలంగాణ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో యంపీసీ గ్రూపును చదువుతున్న జి. సాయివశిష్ఠకు కలెక్టర్ సాంగ్వాన్, డా.సి హెచ్.వి ఆర్ ఆర్ వరప్రసాద్ చేతులమీదుగా బాన్సువాడ డివిజన్ ద్వితీయ బహుమతిని అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నందాల గంగా కిశోర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కళాభారతిలో జరిగిన జిల్లా స్థాయి బహుమతుల ప్రదానోత్సవములో సాయివశిష్ఠ ద్వితీయ బహమతిని అందుకున్నారని చెప్పారు.

తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలోమారక ద్రవ్యనిర్మూలన – విద్యార్థుల బాధ్యత అనే అంశంపై వ్యాసరచన మరియు వకృత్వ పోటీలు జోనల్ ప్రకారము ఈ నెల 24 వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాలబాన్సువాడలోనిర్వహించారని చెప్పారు.కళాశాల ప్రిన్సిపాల్ గంగాకిషోర్ , సహాయప్రిన్సిపాల్ సుమన్,ప్రముఖపద్యకవి, వ్యాఖ్యాత ,సంస్కృతోపన్యాసకులు డా.బి. వెంకట్ కవి, గైడ్ టీచర్ దత్తాత్రేయ, ఉపాధ్యాయులు -జాదవ్, వేణుగోపాల్, నరహరి, రాము, బస్వరాజు, నరేశ్, అశోక్, హన్మాండ్లు, ఉపన్యాసకులు గంగాప్రసాద్, సంజీవ్, మరియు అధ్యాపకబృందం అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -