– అభినందించిన ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మొరాకోలో ఇటీవల జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కూకట్పల్లి డిపోలో పనిచేస్తున్న కండక్టర్ బానోత్ మోహన్ కుమారుడు అకీరా నందన్ సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగు పందెంను 53.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. 200 మీటర్ల పరుగులోనూ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో అకీరాను టీజీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ అభినందించారు. తన కుమారుడిని క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న కండక్టర్ మోహన్ దంపతులను ప్రశంసించారు. భవిష్యత్లో మంచిగా ప్రాక్టిస్ చేసి మరిన్ని అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమంగా రాణించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, సీటీఎం (కమర్సియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, కూకట్పల్లి డీఎం హరి తదితరులు పాల్గొన్నారు.
వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్లో కండక్టర్ కుమారుడి సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES