Monday, June 9, 2025
E-PAPER
Homeఖమ్మంపధకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

పధకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు 
మతం పేరుతో జాతీయతను దెబ్బతీస్తున్న బీజేపీ – రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవారు కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పధకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయింది అని, ముక్కు కోసినా మొదటి మొగుడే నయం అనే సామెతలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకునేలా రేవంత్ రెడ్డి పాలన ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఎద్దేవా చేసారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో మండలంలోని పండువారిగూడెంలో పార్టీ సభ్యులు సీసం రాము గృహంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అద్యక్షతన సోమవారం నిర్వహించిన మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శుల సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్యలు హాజరై మాట్లాడారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలు కోసం అమలు చేస్తున్న ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా అయిదు హామీలు అమలు కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. బ్యాంక్ ఋణాలు రద్దు కాక, కొత్త ఋణాలు అందుబాటులోకి లేక, రైతు భరోసా పూర్తీ స్థాయిలో అమలు చేయక రైతులు విలవిల్లాడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం పదవిని మరిచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. మతం వైషమ్యాలను ప్రేరేపించి రాజ్యాంగ స్పూర్తి, లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తున్నాడు అని అన్నారు. దీంతో జాతీయతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవారు కనకయ్య అన్నారు.

చమురు దిగుమతులపై సుంకం తగ్గించడంతో దేశీయ ఆయిల్ సాగుపై తీవ్ర ప్రభావం పడిందని, ఈ కారణంగా పామాయిల్ గెలలు ధరలు భారీగా పడిపోయాయని అన్నారు. ఈ నిర్ణయాన్ని పీఎం నరేంద్ర మోడీ పునః సమీక్షించి రైతులను ఆదుకోవాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య కోరారు. పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్వహించే ధర్నాను విజయవంతం ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, మడకం గోవిందు, కారం సూరిబాబులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -