Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి

- Advertisement -

– అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
– ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి చొరవతో మండలానికి అధిక ఇండ్లు
నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి చొరవతో మండలానికి అధిక ఇండ్లు వచ్చాయని మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అన్నారు. కాంగ్రెస్ జెండా పేద ప్రజలకు అండగా నిలుస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వల్లపు కుమార్, మాజీ వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి నయీమ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బూడిద రవి, మండల నాయకులు పాల శీను, డిజె శీను, రావుల వెంకట్ రెడ్డి, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad