Wednesday, June 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు భరోసా ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ ఎత్తుగడలు

రైతు భరోసా ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ ఎత్తుగడలు

- Advertisement -

ఇబ్రహీంపట్నం మండలం
ఉప్పరిగూడలో రైతుల నిరసన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్‌ ఎత్తుగడలు వేస్తోందని రైతాంగం విమర్శించింది. తమకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామపం చాయతీ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ తీసుకొచ్చిన రైతుబంధు సాగుకు భరోసా కల్పించిందని అన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుభరోసాను ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో సాగు చేస్తున్న రైతాంగం ఎక్కడి నుంచి పెట్టుబడి ఖర్చు తీసుకురావాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇస్తే ఈ ప్రభుత్వం ఎందుకు కోత విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డబ్బులు అదనంగా పెంచి ఇవ్వకపోగా ఉన్న దాన్ని కోత విధించడమేంటని అన్నారు. ప్రాంతాలతో తారతమ్యం లేకుండా సాగు చేస్తున్న రైతాంగానికి పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో మాజీ ఉప సర్పంచ్‌ నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -