- Advertisement -
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య
నవతెలంగాణ – మద్నూర్
పత్తి రైతులు కపాస్ కిసాన్ డౌన్లోడ్ చేసుకొని సిసిఐ వారి అభ్యర్థనను పత్తి రైతులు పాటిస్తే వారికి పత్తి అమ్ముకోవడానికి మద్దతు ధర లభించడానికి అనుకూలిస్తాయని సోమవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య తెలిపారు. పత్తి రైతులు అనుసరించవలసిన సాధారణ పద్ధతులు1, కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి 2, మొబైల్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి 3, సీసీఐ వద్ద ఎంఎస్పి క్రింద పత్తి అమ్మడానికి స్లాబ్ బుకింగ్ చేసుకోండి. ఈ విధమైన నిబంధనలు పాటిస్తే పత్తి రైతులు అమ్ముకోవడానికి ఎంతో సులభమని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సూచించారు.
- Advertisement -



