Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన శ్రీపాద రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. మండల కేంద్రానికే చెందిన కాంగ్రెస్ కార్యకర్త అబ్దుల్ ఖాదర్ ఇటీవల ఆటో ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన కుమారుడు అజారుద్దీన్ ను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, కాంగ్రెస్ మండల నాయకులు దూలూరి కిషన్ గౌడ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -