- Advertisement -
ప్రమాదమని తెలుసు… ఎందుకు ఈ అలుసు
నవతెలంగాణ – సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి వై నగర్ లో రహదారి మధ్యలో ప్రమాదకరమైన గొయ్యి ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మునిసిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ గొయ్యి ఉండటంతో ఆ రహదారి వెంబడి వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు ఈ గొయ్యిలో పడటంతో వాహనదారులు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ సమస్య తమది కాదంటూ మున్సిపల్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. భారీ ప్రమాదం జరగకముందే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం మున్సిపల్ అధికారులపై ఉంది.
- Advertisement -