Tuesday, July 1, 2025
E-PAPER
Homeకరీంనగర్రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన గొయ్యి

రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన గొయ్యి

- Advertisement -

ప్రమాదమని తెలుసు… ఎందుకు ఈ అలుసు
నవతెలంగాణ – సిరిసిల్ల
: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి వై నగర్ లో రహదారి మధ్యలో ప్రమాదకరమైన గొయ్యి  ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మునిసిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ గొయ్యి ఉండటంతో ఆ రహదారి వెంబడి వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు ఈ గొయ్యిలో పడటంతో వాహనదారులు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ సమస్య తమది కాదంటూ మున్సిపల్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. భారీ ప్రమాదం జరగకముందే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం మున్సిపల్ అధికారులపై ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -