- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి ఆసరాగా నిలుస్తుందని కాంగ్రెస్ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. 24 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం మేనూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో మేనూర్, పెద్ద ఎక్లారా, గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జుబ్రి సురేష్, చందు, సంఘయప్ప, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం మంజూరైన లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



