- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి : నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గంలోని డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అద్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, పోలసని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తాద్రి, డాక్టర్ శాదుల్లా, చింత శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్, రాజన్న,నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -